Latest News Ticker — Single Line

సంగారెడ్డిలో 106 బైక్ సైలెన్సర్లు ధ్వంసం | పోలీసులు కఠిన చర్యలు

By Madhu Goud

Published On:

Follow Us
Sangareddy

సంగారెడ్డి, అక్టోబర్ 16: సంగారెడ్డి జిల్లాలో అధిక శబ్దంతో ప్రయాణించే బైకులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గురువారం సంగారెడ్డి కొత్త బస్టాండ్ ఎదుట డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో 106 అధిక శబ్దం చేసే సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో ధ్వంసం చేశారు. గత మూడు రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పోలీసులు, పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అధిక శబ్దం చేస్తున్న బైకులను నిలిపి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 106 బైకుల్లో నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చినట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం వాటిని ప్రజా సమక్షంలో ధ్వంసం చేశారు.డీఎస్పీ సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ, నగరంలో రాత్రివేళల సమయంలో యువత అధిక శబ్దంతో బైకులు నడపడం వలన ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆసుపత్రులు, నివాస ప్రాంతాల్లో ఈ శబ్దం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల ఈ చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారిపై ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

బైకులకు అధిక శబ్దం చేసే సైలెన్సర్లు అమర్చిన వారు మొదటిసారి పట్టుబడితే జరిమానా విధిస్తామని, పునరావృతం చేస్తే వాహనం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేస్తామని తెలిపారు.ప్రజల ప్రశాంతత కోసం, రోడ్లపై శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని డీఎస్పీ అన్నారు. యువతకు సామాజిక బాధ్యతతో నడుచుకోవాలని, నిబంధనలను పాటించాలనే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రమేష్, ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసులు ఇలాంటి డ్రైవ్‌లు తరచుగా నిర్వహిస్తామని, శబ్ద కాలుష్యంపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.ఈ చర్యతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

“పోలీసుల చర్య వల్ల రాత్రివేళల బైక్ శబ్దం తగ్గుతుందనే ఆశిస్తున్నాం” అని పలువురు స్థానికులు అన్నారు. శబ్ద నియంత్రణ చర్యలను కొనసాగించి నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

 ➤ తెలుగు బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు – జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు

 ➤ కొడుకు నిర్లక్ష్యం తో ఆవేదన చెందిన మాజీ ఎంపీపీ – రూ.3 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం

You Might Also Like

Leave a Comment