Latest News Ticker — Single Line

AP ఉపాధి హామీ శ్రామికుల వేతన బకాయిలు చెల్లింపు – 4 రోజుల్లో ఖాతాల్లో డబ్బులు

By Madhu Goud

Published On:

Follow Us
AP ఉపాధి హామీ

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ (Employment Guarantee) యోజనలో భాగంగా శ్రామికులకు చెల్లించాల్సిన వేతన బకాయిల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,668 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల విడుదలతో మే 15 నుంచి ఆగస్టు 15 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలు త్వరగా పూర్తిగా చెల్లించబడతాయి.

అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిధులు 4 రోజుల్లో శ్రామికుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. ఇది ముఖ్యంగా వేతన బకాయిల కోసం వేచి ఉన్న శ్రామికుల కోసం మంచి వార్త. వారికి నెలలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తీరే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు విడుదలైన నిధుల ద్వారా మాత్రమే మే 15 నుంచి ఆగస్టు 15 వరకు వేతన బకాయిలు చెల్లించబడతాయి. మిగిలిన వేతనాల కోసం దాదాపు రూ.140 కోట్లు అవసరం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రానికి లేఖలు రాసి, వేతన బకాయిల చెల్లింపుకు నిధులు మంజూరు చేయాలని కోరాం అధికారులు తెలిపారు

వేతన బకాయిల చెల్లింపులో కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా పని చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం, రాష్ట్రం ప్రభుత్వం వాటిని వేగంగా శ్రామికుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా ఉపాధి హామీ యోజనలో భాగంగా శ్రామికులకు న్యాయం చేయబడుతుంది.

Read Also

మీ దగ్గర పాత నోటు ఉందా? ఇప్పుడు లక్షల్లో అమ్ముకునే అవకాశం!

సాదా బైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఆధార్ కార్డు దారులకు గుడ్ న్యూస్! వ్యక్తిగత వివరాల్లో మార్పులు ఉచితం

You Might Also Like

Leave a Comment